Saturday, June 20, 2009

తెలుగు జాతి గర్వించదగ్గ దర్శకుల్లో జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకరు, మనకి జంధ్యాల గా తెలిసిన ఆ హాస్యబ్రహ్మ పేరు వినగానే మనకి ఆహ్లాద భరితమైన ఆనుభూతి కలుగుతుంది.అహా నా పెళ్ళంట, జయంబు నిశ్చ్యంబు రా , చూపులు కలిసిన శుభవేళా వంటి ఆరోగ్య కరమైన హాస్యాన్ని అందించి తన సత్తా చాటుకున్నారు. తెలుగువారిని నిండుగా మెండుగానవ్వించిన హాస్యబ్రహ్మఆయన

పక్క హాస్య చిత్రాలను సృష్టిస్తూనే మరో పక్క ఇతర అంశాలకు చెందినచిత్రాల రూపకల్పన చేసి మంచి కీర్తిని అందుకున్నారు. ఆనందభైరవి,నెలవంక వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. రచయత గా కూడా జంధ్యాల తన ఉనికి ని చాటారు, శంకరాభరణం, సప్తపది, జగదేకవీరుడు-ఆతిలొకసుందరి, వేటగాడు ఇలా వైవిద్యమైన రచనల్ని మనకి అందించారు.

ETV లో పొపుల పెట్టె అనే సీరియల్ ద్వారా మనకి బుల్లితెర మీద కూడా తన నవ్వుల జల్లు కురిపించారు, ఆయన రాసిన గుండెలు మార్చబడును అనే నాటిక లో కొటేశ్వర్ రావు అనే పాత్ర ని వేసినందుకు నేను గర్వపడుతున్నాను.

సుమారు 20 సంవత్సరాల పాటు తన రచనలతో, సినిమా లతో, మన అందరి చేత హాస్యప్రాయాణం చేయించిన ఆ హాస్య బ్రహ్మ 2001 జూన్ 19 పరమపదించారు కానీనవ్వులు విరిసినన్నాళ్ళూ ఆయన మన మదిలో నీలేచేవుంటారు


1 comment:

Krishna Manda said...

Haasyam anedi oka varam. Aa varanni prajalaku panchagalagadam oka adrushtam. Jandyala garu eppuduu kuda mana hrudayallo aa hasyanni kurupisthune untaru....